Tuesday, May 21, 2024

AP: చంద్ర‌బాబుతో జ‌గ‌న్ కు ప్రాణ‌హాని.. పోసాని

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి
లేఖ‌ రాస్తాన‌న్న న‌టుడు పోసాని
చంద్ర‌బాబు దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ డాన్
ఈ య‌గానికి రాక్ష‌సుడు చంద్ర‌బాబే
జ‌గ‌న్ చంపుతానంటున్న చంద్ర‌బాబు పై చ‌ర్య‌లేవి..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ప్రాణహాని ఉంద‌ని ఆరోపించారు న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళి.. ఎన్నిక‌ల ప్ర‌చారంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగంగానే జ‌గ‌న్ ను లేపేస్తానంటూ వ్యాఖ్యలు చేసినా పట్టించుకునేవాడే లేడని ఫైర్‌ అయ్యారు. హైద‌రాబాద్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) చంద్రచూడ్ కు లేఖ రాయనున్నట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కి ఒక రోజు రండి.. తిరిగి చూడండి.. వైఎస్‌ జగన్ ను కాపాడండి అని లేఖలో సీజేఐను కోరనున్నట్టు వెల్లడించారు పోసాని..

ఇక, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏదైనా చేస్తా అన్నట్టుగా చంద్రబాబు ఉన్నారని మండిపడ్డారు.. భారత్ దేశంలో నెంబర్ వన్ డాన్ చంద్రబాబుగా పేర్కొన్న ఆయన.. జగన్ ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మాలని విజ్ఞప్తి చేశారు.. ప్రతి యుగానికి ఒక రాక్షసుడు ఉంటాడ‌ని, .. ఈ యుగంలో చంద్రబాబు రాక్షసుడు అంటూ హాట్‌ కామెంట్లు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎవరు ఏం చేసినా నడుస్తుందా ? చేసిన అవినీతి కూడా కనిపించదా ? అని నిలదీశారు పోసాని. అమిత్ షాపై ఫేక్‌ వీడియోలు వ‌స్తే వెంటనే స్పందించి కేసులు పెడుతున్నార‌ని, మరి బహిరంగంగా.. జగన్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడంలేదు.. చంద్రబాబు కామెంట్లను రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. ఇతర నేతలు ఎవరూ వినలేదా ? ఈ ఘటనపై అసలు చర్యలు తీసుకోరా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement