Thursday, May 23, 2024

HYD : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మంగళ హారతులతో స్వాగతం పలికిన బస్తీ వాసులు

కర్మన్ ఘాట్, నవంబర్ 5( ప్రభ న్యూస్)
ఎల్బీనగర్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవి రెడ్డి సుధీర్ రెడ్డి ప్రచారానికి హస్తినాపూర్ డివిజన్ వివిధ కాలనీలకు వచ్చిన సందర్భంగా మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. భూపేష్ గుప్తా నగర్, జనార్దన్ రెడ్డి నగర్, నందనవనం, బాంబే కాలనీలో ప్రచారానికి ఆదివారం ఉదయం కాలనీలకు రాగా పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు అభిమానులు స్వాగతం పలికి ఇంటి ఇంటి వద్ద మంగళవారతులతో స్వాగతం పలకడంతో పాటు పూల వర్షం కురిపించారు.

ఈ సందర్భంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని తెలిపారు. స్థానికంగా ఉంటూ ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కోరారు. మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గం రూపురేఖలు మార్చేందుకు మరొక అవకాశం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో గజ్జల మధుసూదన్ రెడ్డి, అంతోజు సత్యం చారి, శ్రీనివాస్ యాదవ్, ఉదయ్ కుమార్ రెడ్డి, పద్మనాయక్, నాగిరెడ్డి, శివారెడ్డితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement