Sunday, May 5, 2024

HYD : శ్రీ పోచమ్మ తల్లి ఆశీస్సులతో బీజేపీ జెండా ఎగరవేస్తాం

ఎల్బీనగర్, నవంబర్ 5 (ప్రభ న్యూస్)
మన్సురాబాద్ శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో ఎల్బీనగర్ లో బిజెపి జండా ఎగరవేస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డి దీ మా వ్యక్తం చేశారు . కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మన్సురాబాద్ శ్రీ పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపి ప్రచార రధాన్ని రంగారెడ్డి తో కలిసి ప్రారంభించారు.

అవినీతి రహిత పాలన బిజెపి ద్వారానే సాధ్యమన్నారు. ఎల్బీనగర్ లో బిజెపి జండా ఎగరవేస్తామన్నారు. కొప్పుల నర్సింహారెడ్డి మాట్లాడుతూ, రంగారెడ్డి ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీ గెలుపు కోసం పనిచేసే వ్యక్తి.టిడిపిలో 8 డివిజన్లకు ఏడుగురు కార్పోరేటర్లు బిజెపిలో 11 కు 11 కార్పొరేటర్ ల గెలుపు నిస్వార్ధంగా కోసం కృషి చేసినారని తెలిపారు. ఆయన గెలుపుకు కూడా అదే విధంగా పనిచేసి ఎల్బీనగర్లో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు.l ఈ కార్యక్రమంలో నాంపల్లి రామేశ్వర్ దామోదర్ గౌడ్ హరీశ్వర్ రెడ్డి పాతురి శ్రీధర్ గౌడ్ కృష్ణరెడ్డి కడారి యాదగిరి యాదవ్ ముత్యం రెడ్డి,నాంపల్లి శ్రీకాంత్ ,నవీన్ గుప్తా, యంజాల జగన్ కవితా రెడ్డి, శ్యామల, మాధవి , తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement