Sunday, May 12, 2024

పోలీసులకి కరోనా..ఆందోళనలో సిబ్బంది

హైదరాబాద్ : అందరికి జాగ్రత్తలు చెప్పే పోలీసులు కూడా కరోనా బారిన పడుతున్నారు. కాగా బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ లో కరోనా మరోసారి కలకలం సృష్టిస్తోంది. పీఎస్‌కు చెందిన ఏడుగురు పోలీసులు పరీక్షలు చేయించుకోగా వారిలో 5మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. షాకత్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకున్న నలుగురు కానిస్టేబుళ్లతో పాటు ఒక హోంగార్డుకు పాజిటివ్ వచ్చింది. వీరందరినీ హోం క్వారంటైన్ ఉండాలని అధికారులు సూచించారు. గతేడాది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో 55 మంది సిబ్బందికి కరోనా సోకింది. ఇదే పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్ఐ కరోనాతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో మరోసారి పీఎస్‌లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement