Sunday, May 12, 2024

హైదరాబాద్‌లో పెయింటర్ దారుణహత్య

హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జగద్గిరిగుట్టలోని సంజయ్‌గాంధీ నగర్‌లో శుక్రవారం రాత్రి సురేశ్‌ అనే వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు దాడిచేశారు. ఆటోలో వచ్చిన రోషన్‌, రోహిత్‌లు సురేశ్‌పై కత్తితో దాడిచేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికుల ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు. దేవమ్మ బస్తీకి చెందిన సురేశ్‌ పెయింటర్‌గా పనిచేస్తున్నాడని, పాత కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరూ పరారీలో ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారికోసం గాలిస్తున్నామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement