Saturday, May 4, 2024

సాయి ధరమ్ ఆరోగ్యంపై అపోలో జేఎండీ కీలక ప్రకటన

హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీతారెడ్డి తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం సాయి తేజ్‌‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. తలకు బలమైన గాయాలు లేవని, వెన్నుపూసకు ఎలాంటి దెబ్బ తగల్లేదని వెల్లడించారు. అన్ని అవయవాలు సక్రమంగా పని చేస్తున్నాయని చెప్పారు. అన్ని వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఎప్పటికప్పుడు వివరాలను అందిస్తామని తెలిపారు. ఎప్పటికప్పుడు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేస్తామని అపోలో జేఎండీ సంగీతారెడ్డి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండిః సెల్ఫీ వీడియోః సీఎం సార్ న్యాయం చేయండి.. ఇక ఆత్మ‌హ‌త్యే దిక్కు..

Advertisement

తాజా వార్తలు

Advertisement