Tuesday, May 14, 2024

జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవం – కెసిఆర్ శుభాకాంక్ష‌లు..

హైద‌రాబాద్ : ప్రభుత్వ పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరిగినపుడే, ప్రజల సహకారంతోనే పాలనావ్యవస్థ ప్రగతిపథంలో ముందడుగు వేస్తుందని సీఎం కెసిఆర్ అన్నారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ లో ట్విట్ చేశారు. స్వాతంత్ర్యానంతర భారత దేశంలో ప్రజలను పాలనలో భాగస్వాములను చేయాలనే మహోన్నత లక్ష్యంతో నాటి సోషల్ ఇంజనీర్ గా ప్రసిద్ది పొందిన సురీందర్ కుమార్ డే (ఎస్‌కేడే) పంచాయతీరాజ్ వ్యవస్థకు అంకురార్పణ చేశారన్నారు. ప్రజలు తమ అభివృద్ధిని తామే నిర్వచించుకునే స్వయం సహకార ఉద్యమం లో భాగంగా పంచాయతీ రాజ్ వ్యవస్థ భారత దేశంలో రూపుదిద్దుకున్నదని సీఎం గుర్తు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement