Wednesday, July 24, 2024

Bihar : బిజెపి సీనియర్ నేత, బీహార్ మాడీ డిప్యూటీ సిఎం సుశీల్ కుమార్ మోదీ క‌న్నుమూత‌…. రాష్ట్రపతి, ప్ర‌ధానిల సంతాపం

బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ ఢిల్లీలోని ఎయిమ్స్లో సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్ర‌ధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. ఆయన ఆకస్మిక మరణం కోలుకోలేని లోటు అని రాష్ట్ర‌ప‌తి ముర్ము ‘ఎక్స్’లో రాసుకొచ్చారు. అతని సౌమ్య స్వభావం, సమర్థవంతమైన నిర్వాహకుడిగా సహకారం, ప్రజా జీవితంలో స్వచ్ఛత అతని వ్యక్తిత్వం ఆయన పనిలో ప్రతిబింబిస్తాయన్నారు.

- Advertisement -

సుశీల్ మోడీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేసి నివాళులర్పించారు. ఆయనను స్మరించుకుంటూ ప్రధాని ఇన్స్టాగ్రామ్లో ఇలా రాశారు. ‘పార్టీలో నా విలువైన సహచరుడు, దశాబ్దాలుగా నా మిత్రుడు సుశీల్ మోడీ జీ అకాల మరణం పట్ల చాలా బాధపడ్డాను. బీహార్లో బీజేపీకి విజయాన్ని అందించారు.

బీహార్‌లో బీజేపీ ఎదుగుదల, దాని విజయాల వెనుక అతని అమూల్యమైన సహకారం ఉంది. ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ విద్యార్థి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతో కష్టపడి, స్నేహశీలిగా ఉండే ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయాలకు సంబంధించిన విషయాలపై ఆయనకున్న అవగాహన చాలా లోతైనది. పరిపాలనాదక్షుడిగా కూడా ఎన్నో ప్రశంసనీయమైన పనులు చేశారు. జీఎస్టీని ఆమోదించడంలో ఆయన చురుకైన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ శోక ఘడియలో ఆయన కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి!’. అని రాసుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement