Tuesday, April 30, 2024

వైకుంఠదామం నిర్మాణ అభివృద్ధి పనుల పరిశీలన..

కుత్బుల్లాపూర్‌ : నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో భవ్యాస్‌ అపార్టుమెంట్‌ ఎదురుగా వైకుంఠ దామం నిర్మాణ అభివృద్ధి పనులను కమీషనర్‌ గోపి, సీనియర్‌ నాయకులు కోలన్‌ గోపాల్‌రెడ్డిలు, ఆవుల జగన్‌యాదవ్‌లు పర్యవేక్షించారు. నిలిచిపోయిన నిర్మాణ అభివృద్ధి పనులు త్వరిగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను త్వరగా పూర్తి చేయిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఇ సుబ్రహమణ్యం, ఇంజనీరింగ్‌ విభాగం శ్రీనివాస్‌రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement