Saturday, April 27, 2024

టీఆర్ఎస్ రాష్ట్ర నేత ప్ర‌తాప్ కు స‌న్మానం

132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని బ్యాంక్ కాలనీలో వర్షపు నీరు పోవడానికి వరద కాలువ, రోడ్ నెంబర్ 5 లో సీసీ రోడ్డును పూర్తి చేయించమని బ్యాంక్ కాలనీ సంక్షేమ సంఘం వారు టి.ఆర్.ఎస్. పార్టీ రాష్ట్ర నాయకులు కె.యం. ప్రతాప్ ను కోరగా, ప్రతాప్ వెంటనే స్పందించి కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ అధికారులతో చర్చించి వర్షపు నీరు పోవడానికి పైపులు వేయించి, వరద కాలువ నిర్మానాన్ని, సీసీ రోడ్డును పూర్తి చేయించారు.

ఈ సందర్భంగా సంక్షేమ సంఘం సభ్యులు టి.ఆర్.ఎస్. పార్టీ రాష్ట్ర నాయకులు కేఎం. ప్రతాప్ ను శాలువాతో సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గంధం సుధాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్, వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, మల్లేష్, తేజ, గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement