Tuesday, May 14, 2024

HYD: 27న బీజేపీలో చేరనున్న గడ్డం సాయి కిరణ్

రామంతపూర్: ఈనెల 27న బీజేపీలో చేరబోతున్నట్లు గడ్డం సాయికిరణ్ తెలిపారు. రామంతాపూర్ లో ఏర్పాటు చేసిన సమావేశలో ఆయన మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ తనను, బీసీలను గుర్తించక పోవడంతో మనస్తాపానికి గురై తన పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం సాయి కిరణ్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తనకు ఎలాంటి పదవి ఇవ్వకపోయినా ఒక నిబద్ధతతో పనిచేసి పార్టీ అభ్యర్థుల గెలుపులో తన వంతు కృషి చేశానన్నారు.

బీసీలను బీఆర్ఎస్ పార్టీ చిన్న చూపు చూస్తుంది. కాబట్టి తాను ఈనెల 27న సుమారు 6000 మందితో బీజేపీ పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. భారీ బహిరంగ సభను కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాబట్టి రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీ కోసం ఏవిధంగా అయితే పనిచేశానో దానికి రెట్టింపు బాధ్యతతో బీజేపీ పార్టీ కోసం పనిచేసి ఉప్పల్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్రం చేశారు. తనకు ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రజలతో సత్ సంబంధాలు ఉన్నాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement