Saturday, May 4, 2024

కుషాయిగూడ‌లో అగ్నిప్ర‌మాదం – షాపులు ద‌గ్ధం..

హైదరాబాద్‌: కుషాయిగూడలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌తో కూలర్ల షాప్‎లో మంటలు చెలరేగాయి. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో నాలుగు కూలర్ షాపులు ఒక ప్లాస్టిక్ షాప్, ఫర్నిచర్ షాప్, దుస్తుల షాపుతో పాటు ఒక డీసీఎం వ్యాన్ కూడా పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే సరికి షాపులన్నీ మంటల్లో బూడిదయ్యాయి. రాత్రి సమయంలో ప్రమాదం కావడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది వేగంగా స్పందించి.. మంటలను మిగతా ప్రాంతాలకు విస్తరించకుండా అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. విషయం తెలుసుకున్న షాప్ యజమానులు తమ షాపులు అగ్నికి ఆహుతి కావడంతో బాధితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అప్పు చేసి పెట్టుకున్న షాపులన్నీ క్షణాల్లో దగ్ధమైపోయాయంటూ కన్నీరుమున్నీరవుతన్నారు. కాగా మాజీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ప్ర‌మాద వార్త తెలిసిన వెంట‌నే అక్క‌డికి చేరుకున్నారు.. స‌హాయ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షించారు.. బాధిత‌ల‌ను ఓదార్చారు.. వారికి త‌గిన న‌ష్ట‌ప‌రిహారం వ‌చ్చేలా చేస్తాన‌ని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement