Wednesday, May 15, 2024

కాంగ్రెస్‌ను ఆదరించండి..

కర్మన్‌ఘాట్‌ : లింగోజిగూడ డివిజన్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ని ఆదరించి తనను కార్పొరేటర్‌గా గెలిపించాలని కాంగ్రెస్‌ అభ్యర్థి దరిపల్లి రాజశేఖర్‌రెడ్డి కోరారు. మణిపురికాలనీలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగోజిగూడ డివిజన్‌లో నెలకొన్న సమస్యలు తనకు పూర్తిగా తెలుసు అన్నారు. సమస్యల పరిష్కారం కోసం అధికారులు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరిష్కరిస్తానని అన్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్లమ్మ, సాయి, చింటు, రాజు, సన్ని, సచిన్‌, చంటి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement