Monday, April 29, 2024

చిరంజీవి హీరోయిన్ కి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైన నేపథ్యంలో సామాన్య ప్రజలతో పాటు సిని రాజకీయ ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి సమీరా రెడ్డి కూడా ఆ జాబితాలో చేరారు. ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

కరుణ లక్షణాలు స్వల్పంగా కనిపించడంతో వైద్యుని సంప్రదించి పరీక్షలు చేయించుకున్నానని… కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపారు. సెల్ఫ్ ఐసోలాషన్ లో చికిత్స తీసుకుంటున్నట్లు సమీరారెడ్డి ప్రకటించారు. ఇక వారి కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా టెస్టులు చేయగా నెగటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement