Friday, March 29, 2024

సుదర్శన్‌ యాదవ్‌ మృతదేహానికి నివాళులు..

కర్మన్‌ఘాట్‌ : ధ్యానాంజనేయ స్వామి దేవాలయ మాజీ చైర్మన్‌, జాతీయ కబడ్డీ క్రీడాకారుడు ఊరుసుల సుదర్శన్‌యాదవ్‌ మరణం బాదాకరమని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. గుండెపోటుతో అకాల మరణం చెందిన విషయాన్ని తెలుసుకున్న ఆయన లింగోజిగూడలోని సుదర్శన్‌యాదవ్‌ నివాసం వద్ద ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు హనుమాన్‌ దేవాలయ ధర్మకర్త నర్రె శ్రీనివాస్‌కురుమ, లింగోజిగూడ డివిజన్‌ అధ్యక్షులు తిలక్‌రావు, ప్రవీణ్‌రెడ్డి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement