Monday, May 6, 2024

కార్పొరేటర్‌కు వినతిపత్రం..

కర్మన్‌ఘాట్‌ : హస్తినాపురం డివిజన్‌ పరిధిలోని కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని కార్పొరేటర్‌ సుజాతనాయక్‌ అన్నారు. ఆమె సాయిగాయత్రినగర్‌, హస్తినాపురం నార్త్‌ ఎన్‌క్లేవ్‌, కృష్ణానగర్‌లో కాలనీవాసులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలనీల్లో నెలకొన్న సమస్యలను అంచలంచలుగా పరిష్కరిస్తానని అన్నారు. సమస్యలను ఎంపి, ఎంఎల్‌ఎ, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఎన్నికల సమయంలోనే పార్టీలు ఎన్నికల అనంతరం పార్టీలకు అతీతంగా అభివృద్దికి అందరం కలిసికట్టుగా పనిచేస్తామని అన్నారు. అనంతరం అగ్రికల్చర్‌ కాలనీలో తై కాండో కరాటే పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షుడు నరేష్‌యాదవ్‌, శాంతిదేవ్‌మిత్ర, శ్రీదర్‌, చంద్రశేఖర్‌రెడ్డి, సంకల్ప శుక్ల, కాలనీ వాసులు పిండి లింగారెడ్డి, మోహన్‌రెడ్డి, రంగారెడ్డి, పిండి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement