Sunday, April 28, 2024

HYD: చలివేంద్రాన్ని ప్రారంభించిన‌ ఉప్పల శ్రీనివాస్ గుప్తా..

హైదరాబాద్: హైదరాబాద్ లోని ఉప్పల్, రామంతపూర్ లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఐవీఎఫ్ జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి చలివేంద్రంను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్‌ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సంబు పాండు గుప్తా, ఐవీఎఫ్ మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రటరీ కొత్తపల్లి రమేష్, కోశాధికారి బోనగిరి శ్రవణ్ కుమార్, ఐవీఎఫ్ స్టేట్ ఆధ్యాత్మిక చైర్మన్ బోనగిరి శ్రీనివాస్, నగేష్, ఐవీఎఫ్‌ మేడ్చల్ జిల్లా నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement