Friday, May 24, 2024

ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

గోషామ‌హాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‎‎ను ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న‌ రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలకు గొడవ జరిగింది. ఈ గొడవలో కొంతమంది బీజేపీ నాయకులు గాయపడగా.. మరికొంత మందిని పోలీసులు అరెస్ట్ చేసి సిరిసిల్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో గాయపడిన వారిని పరామర్శించేందుకు ఎమ్మెల్యే రాజాసింగ్ కొంతమందితో కలిసి ఎల్లారెడ్డిపేటకు బయల్దేర‌గా పోలీసులు రాజాసింగ్ బృందాన్ని అదుపులోకి తీసుకొని అల్వాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement