Sunday, May 26, 2024

బ‌స్తీవాసుల‌కు డ‌బుల్ బెడ్రూమ్ ల కోసం స్థ‌లం కేటాయించాలి

ఉప్పల్ ఎమ్మెల్యే భేతీ సుభాష్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ డి.రవీందర్ ను కలిశారు. ఉస్మానియా క్యాంపస్ పరిధిలోని బస్తీ వాసులకు డబుల్ బెడ్ రూమ్ లు నిర్మించేందుకు స్థలం కేటాయించాలని, ప్రస్తుతం మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అదేవిధంగా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిరుద్యోగ విద్యార్థుల కోసం నియోజకవర్గానికి ఒక ఉచిత కోచింగ్ సెంటర్ నెలకొల్పాలని విన్నవించిన సందర్భంగా వైస్ ఛాన్స‌ల‌ర్ తో చర్చించి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కానీ, ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సిగూడ డివిజన్ జే ఎస్ ఎన్ కాలనీ కమిటీ హాల్ లో ఎమ్మెల్యే సొంత డబ్బులతో నిర్వహించేందుకు సహకరించాలని ఎమ్మెల్యే వీసీతో చర్చించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, బద్దం భాస్కర్ రెడ్డి, గరిక సుధాకర్, గాయం శ్రీధర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, ఉస్మానియా యూనివర్సిటీ బస్తీవాసులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement