Saturday, June 1, 2024

TS: కెనరా బ్యాంక్ శాఖలో బంగారం గోల్ మాల్!

రూ.1.44 కోట్ల విలువైన రెండు కిలోల తాకట్టు బంగారం మాయం ?
వార్షిక ఆడిట్ లో ఆడిటర్ల గుర్తింపు
ఆలస్యంగా వెలుగుచూసిన వైనం
నాలుగు రోజుల క్రితమే బ్యాంక్ గోల్డ్ అప్రెజర్ ఉడాయింపు
పోలీసులకు ఫిర్యాదు చేసిన బ్యాంక్ ఉన్నతాధికారుల
మంగపేట, మే 26 (ప్రభ న్యూస్) : ములుగు జిల్లా మంగపేట మండలంలోని జిల్లా సరిహద్దు ప్రాంతమైన రాజుపేట కెనరా బ్యాంక్ శాఖలో ఖాతాదారులకు చెందిన బంగారం భారీ ఎత్తున గోల్ మాల్ జ‌రిగిన‌ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబందించి వివరాలు ఇలా ఉన్నాయి.

రాజుపేట కెనరా బ్యాంక్ శాఖ పరిధిలోని వందలాది మంది రైతులు, వ్యాపారులు తమకున్న వ్యవసాయ, వాణిజ్య, వ్యాపారాల నిమిత్తం బ్యాంకులో తమ బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలు తీసుకున్నారు. సుమారు రూ.1.44 కోట్ల విలువ చేసే దాదాపు 2 కిలోల117 గ్రాముల మేర బంగారంను సదరు బ్యాంక్ అప్రైజర్ తన చాకచక్యంతో కొట్టేసినట్లు వెలుగులోకి వచ్చింది. కెనరా బ్యాంకు శాఖలో ఇటీవల వారం రోజులుగా వార్షిక ఆడిట్ జరుగుతున్న క్రమంలో ఖాతాదారులు గత ఏడాది తాకట్టు పెట్టిన బంగారం నిల్వలను తనిఖీ చేస్తున్న ఆడిట్ అధికారులకు సదరు నిల్వలకు తాకట్టు లెక్కలకు ఏమాత్రం పొంతన కుదరకపోవడంతో ఈ విషయాన్ని ఆడిట్ అధికారులు బ్యాంక్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్ళగా… బ్యాంకు మేనేజర్ బ్యాంక్ అప్రైజర్ ను సంప్రదించేందుకు ప్రయత్నం చేయగా, ఆయన అప్పటికే గ్రామం నుంచి కుటుంబంతో సహా ఉడాయించినట్లు తెలుస్తోంది.

ఈ విషయమై రెండు రోజుల క్రితం స్థానిక మంగపేట పోలీసులకు బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. కాగా సదరు అప్రైజర్ ఏడాదిన్నర కాలంగా నర్సంపేట నుంచి వలస వచ్చి పాలాయిగూడెంలో ఓ ఇల్లు కొనుగోలు చేసి రాజుపేటలో గోల్డ్ షాప్ నిర్వహిస్తూ చుట్టు ప్రక్కల గ్రామస్తులందరినీ మచ్చిక చేసుకొని మర్యాదస్తుడిగా మసలుకొంటూ దొరికిన చోటల్లా ప్రైవేట్ గా అప్పులు తీసుకొని వాటితో పాటు బ్యాంక్ బంగారం నిల్వలతో పరారైయినట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు తాము తాకట్టు పెట్టిన బంగారం బ్యాంకులో ఉందని ప్రశాంతంగా ఉన్న వారు ఈ సంఘటన బయటకు పొక్కడంతో ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement