Sunday, May 5, 2024

తెలంగాణాలో కొత్త‌గా 684 క‌రోనా పాజిటివ్స్ – త్రి డెత్స్..

హైదరాబాద్‌ : తెలంగాణాలోగడిచిన 24 గంటల్లో కొత్త‌గా 684 పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి.. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,07,889కు చేరింది. ఇక నేడు మరో ముగ్గురు మృత్యువాతపడ్డారు. దీంతో మృతుల సంఖ్య 1,697కు పెరిగింది..గ‌డిచిన 24 గంట‌ల‌లో కొవిడ్ నుంచి చి 394 మంది కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి 3,01,227 మంది కోలుకున్నారు. . ప్రస్తుతం రాష్ట్రంలో 4,665 యాక్టివ్‌ కేసులున్నాయి. అలాగే 1,873 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు..కాగా, కొత్తగా రికార్డయిన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 184 పాజిటివ్స్ ఉండ‌టం విశేషం…అలాగే మంగళవారం రాష్ట్రంలో 56,122 టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వివరించింది. .

Advertisement

తాజా వార్తలు

Advertisement