Saturday, April 27, 2024

దళిత బంధుపై ఈసీకి ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ ఫిర్యాదు

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ముగిసే వ‌ర‌కు ద‌ళిత బంధు కార్యక్ర‌మాన్ని ఆ నియోజకవర్గంలో నిలిపివేయాల‌ని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ భార‌త ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ కి విన‌తిప‌త్రం అందజేసింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో త్వరలో హుజురాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. అయితే, అదే సమయంలో హుజూరాబాద్ నుంచి దళిత బంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనుంది. దీంతో ఈ పథకం ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యలో ఫోరం ఫర్ గుడ్ గవిర్నెన్స్ ఈసీకి ఫిర్యాదు చేసింది. హుజూరాబాద్ ఉపఎన్నిక ముగిసే వరకు పథకాన్ని హుజూరాబాద్ లో నిలిపి వేయాలని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement