Sunday, May 12, 2024

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధ‌ర‌లు త‌గ్గించే వ‌ర‌కు పోరాటం : రేవంత్ రెడ్డి

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించేవరకు పోరాడుతామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో తెలంగాణ‌ కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్ జ‌రిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… రైతులు పండించిన ప్రతి గింజ కొనేవరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని పేర్కొన్నారు. రేపు విద్యుత్ సౌధ, సివిల్ సప్లై ఆఫీసులు కూడా ముట్టడిస్తామన్నారు. ఈ నెలాఖరున వరంగల్‌లో జరిగే సమావేశానికి.. రాహుల్ గాంధీ రావాలని ప్రతిపాదన పెట్టామని రేవంత్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement