Friday, April 26, 2024

ఫెమా ఉల్లంఘ‌న కేసు.. ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన గ్రానైట్ వ్యాపారులు

ఫెమా చట్టం ఉల్లంఘన కేసు విచారణలో భాగంగా గ్రానైట్ వ్యాపారులు హైదరాబాద్ ఈడీ కార్యాలయం ఎదుట హాజరయ్యారు. సీనరేజ్ ఎగ్గొట్టేందుకు ఎగుమతి చేసిన గ్రానైట్ తక్కువగా చూపారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ విచారణ చేస్తోంది. 2013లో అప్పటి ప్రభుత్వానికి విజిలెన్స్ ఎన్‎ఫోర్స్‎మెంట్ నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలో సుమారు రూ.600 కోట్ల పన్ను ఎగ్గొట్టారని గ్రానైట్ కంపెనీలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు రంగంలోకి దిగిన ఈడీ కొద్ది రోజుల క్రితం ఎనిమిది గ్రానైట్ కంపెనీలలో సోదాలు నిర్వహించింది. ఈరోజు గ్రానైట్ వ్యాపారుల‌ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement