Thursday, May 16, 2024

Flash: యాదగిరిగుట్టలో తండ్రికూతురు ఆత్మహత్య

యాదగిరిగుట్టలో అర్ధరాత్రి ఓ ప్రైవేట్ లాడ్జీ పైనుండి దూకి తండ్రికూతురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కుటుంబ కలహాలతో చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ లభ్యమైంది. ఒక్కడినే చనిపోతే కూతురును భార్య సరిగా చూసుకోలేదని, అందుకే కూతురుతో కలిసి సూసైడ్ చేసుకుంటున్నట్లు సూసైడ్ లెటర్ లో పేర్కొన్నారు. మృతులు హైదరాబాద్ చందానగర్ కు చెందిన చెరుకూరి సురేష్(40), చెరుకూరి శ్రేష్ట(06)గా గుర్తించారు.

కాగా, మృతుడు సురేష్ హైదరాబాద్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement