Thursday, May 2, 2024

Flash: చికెన్ కొనుగోలులో ఘర్షణ.. మాజీ సర్పంచ్ పై యాసిడ్ దాడి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని తిప్పాపురంలో గురువారం అర్ధరాత్రి మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ నాయకుడు దుర్గం పర్శరాంపై యాసిడ్ దాడి జరిగింది. తిప్పాపురంలోని ఓ చికెన్ సెంటర్ లో చికెన్ కొనుగోలు చేసేందుకు వచ్చిన సౌరాల కాలనీకి చెందిన కొంత మంది యువకులు పరశురాంపై విచక్షణా రహితంగా దాడికి దిగి చితకబాదారు. చికెన్ సెంటర్ నిర్వాహకుడికి సౌరాల కాలనీకి చెందిన యువకులకు చికెన్ కొనుగోలుపై వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న మాజీ సర్పంచ్ పరశురాం ఇరువర్గాలను శాంతింపజేసే చేసే ప్రయత్నం చేశాడు. అయితే, రెచ్చిపోయిన సౌరాల కాలనీకి చెందిన యువకులు మాజీ సర్పంచ్ పై యాసిడ్ దాడి చేయడంతో పాటు చికెన్ సెంటర్ నిర్వాహకుడి బంధువులపై కర్రలు, చెప్పులు, రాళ్లతో దాడి చేశారు. గాయాలపాలైన మాజీ సర్పంచ్ పరుశురాం, చికెన్ సెంటర్ నిర్వాహకుడిని, మరికొందరు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement