Thursday, April 25, 2024

Covid-19: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు స్వల్పంగా పెరిగాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1335 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,25,775 కు చేరింది. ఇక దేశంలో 52 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 5,21,181కి చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1918 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఆ రికవరీల సంఖ్య 4,24,90,922కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 13,672 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,84,31,89,377 కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement