Tuesday, May 28, 2024

Delay – సికింద్రాబాద్ – విశాఖ వందేభారత్ రీ షెడ్యూల్

సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (20834) ఐదు గంటల ఆలస్యంగా బయల్దేరనుంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరాల్సిన ఈ రైలును రాత్రి 8 గంటలకు రీషెడ్యూల్‌ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈమేరకు ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. మామూలుగా అయితే, ఈ రైలు మధ్యాహ్నం 3 గంటలకే సికింద్రాబాద్‌లో బయల్దేరాల్సి ఉంది. అయితే, విశాఖలో ఈ ఉదయం 5.45 గంటలకు బయల్దేరాల్సిన రైలు (20833) దాదాపు 5 గంటలు ఆలస్యం అయినట్లు సమాచారం. అదే రైలు సికింద్రాబాద్‌కు చేరుకొని తిరిగి విశాఖకు వెళ్లాల్సిఉండటంతో ఈ రైలును అధికారులు సికింద్రాబాద్‌లో రాత్రి 8 గంటలకు రీషెడ్యూల్ చేశారు.

మరోవైపు, వేసవి రద్దీ దఅష్ట్యా ఏర్పాటుచేసిన పలు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. నిర్దేశిత తేదీల్లో నడుస్తోన్న ఈ ప్రత్యేక సర్వీసులను ఆయా స్టేషన్ల మధ్య మే 30 నుంచి జులై 1 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement