Wednesday, May 22, 2024

ఆ ఘనత కేసీఆర్ దే.. కేంద్రానికి పతనం తప్పదు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాలను సాగులోకి తెచ్చి రైతన్నలకు అండగా నిలిచిన ఘనత మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రైతు నిరసన దీక్ష టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నిర్వహించారు. ఇందులో భాగంగా నేలకొండపల్లి మండలంలో నిర్వహించిన రైతు నిరసన దీక్షలో పాల్గొన్న పొంగులేటి మాట్లాడుతూ.. అధికారం కోసమో… పదవులకోసమో అన్నదాతల సంక్షేమాన్ని విస్మరిస్తే రాబోవు రోజుల్లో పతనం తప్పదని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో రైతన్నల చుట్టూ తిరిగి వారి అండదండలతో అందలం ఎక్కాక వారి బాగోగులు పట్టించకోకపోవడం దారుణమైన విషయమన్నారు. తమకు అనుకూలంగా ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లోని రైతులకు ఓ న్యాయం… అనుకూలంగా లేని రాష్ట్రాల్లో ఓ న్యాయం చేయడం సిగ్గుచేటన్నారు. ఇదే ద్వంద్వ నీతిని పాటిస్తే తెలంగాణ రైతులతో పాటు ప్రజానీక ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement