Sunday, May 5, 2024

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొన్న నటి సాక్షి

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో నటి దేవ్ సాక్షి పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ జీహచ్ఎంసీ పార్క్ లో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నటి సాక్షి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు  నాటడం ఆనందంగా ఉందని అన్నారు. తాను నాటిన మొక్కకు అవని పేరు పెట్టానని తెలిపారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. అనంతరం నటులు ఆశిష్ గాంధీ,సురేఖ వాణి, సంజన ముగ్గురికి సాక్షి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement