Wednesday, May 8, 2024

హైదరాబాద్ ఇమేజ్ ను పెంపొందించేందుకు కృషి చేయాలి – గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్: నూతన సంవత్సరం సందర్భంగా నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ను తెలంగాణ గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు, కూకట్ పల్లి జోనల్ కమిషనర్ వి.మమత, హైదరాబాద్ జిల్లా గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ అధ్యక్షులు ఎం.బి.క్రిష్ణ యాదవ్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ క్యాలెండర్ ను మేయర్ కు బహుకరించారు. నగరాభివృద్ధిలో అధికారులు క్రియాశీలకంగా పనిచేసి హైదరాబాద్ ఇమేజ్ ను మరింత పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్లు పంకజ, రవికిరణ్, వైద్యాధికారి డా. భార్గవ్ నారాయణ్, టి.జి.ఓ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, జె.నర్సింగ్ రావు, గోపీచంద్, ఖాదర్, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement