Tuesday, May 14, 2024

Delhi – టిక్కెట్ల కోసం ఢిల్లీలో కాంగ్రెస్ ఆశావాహుల ధర్నా..

ఢిల్లీ/ ఇల్లందు అర్బన్ (ప్రభ న్యూస్) – ఢిల్లీ లోని ఏఐసీసీ కార్యాలయం ముందు ఇల్లందు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్దులు ధర్నాకు దిగారు. కాంగ్రెస్ పార్టీ ఇల్లందు నియోజకవర్గంలో నుండి పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కష్టపడి జండా మోసిన నాయకులకి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని నినాదాల చేశారు. నిన్న కాక మొన్న పార్టీలో వచ్చిన కోరం కనకయ్యను టికెట్ కేటాయించవద్దు .. సేవ్ కాంగ్రెస్ .. సేవ్ ఇల్లందు.. పేరాచూట్కు హటావో.. ఇల్లందుకు బచావో .. అనే నినాదాలతో ఏఐసీసీ కార్యాలయం ముందు ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ కూడా ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమం లో భూక్యా దళ్ సింగ్ నాయక్, చీమల వేంకటేశ్వర్లు,కామేపల్లి జెడ్పీటీసీ వెంకట ప్రవీణ్, నాగేంద్ర నాయక్ ,విజయ లక్ష్మి ,శంకర్ నాయక్ , లక్ష్మణ్ నాయక్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement