Saturday, May 4, 2024

Komatireddy: కేసీఆర్ కు దమ్ముంటే మునుగోడు నుంచి పోటీ చేయాలి… రాజగోపాల్ రెడ్డి

తాను మునుగోడు నుంచే పోటీ చేస్తానని, కేసీఆర్ కు దమ్ముంటే మునుగోడు నుంచి పోటీ చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. బీజేపీకి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి మొయినాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ… తాను కాంగ్రెస్ లో రెండు సీట్లు అడగడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే గజ్వేల్ నుంచి కూడా పోటీ చేస్తానన్నారు. గజ్వేల్ లో అవకాశమిస్తే కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు. డబ్బు అధికారంతో మునుగోడులో గెలిచారన్నారు.

దేశంలో అత్యంత అవినీతి సీఎం కేసీఆరేనన్నారు. కేసీఆర్ అవినీతిపై కేంద్రం చర్యలు తీసుకోవడం లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రజలు అనుకుంటున్నారన్నారు. తప్పుడు నిర్ణయాలతో బీజేపీ బలహీనపడిందన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. ప్రజల కోరిక మేరకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement