Saturday, April 27, 2024

మంత్రులు, కలెక్టర్ల వీపులు పలుగుతాయి: జగ్గారెడ్డి వార్నింగ్

వరి సాగుపై  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు చేస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు డ్రామాలు బంద్ చేయాలన్నారు. కాంగ్రెస్ రైతుల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు. నవంబర్1 తర్వాత చలో సిద్దిపేట చేపడతామని ప్రకటిచాంరు. మంత్రులు ప్రతిపక్షాలను రండలు అని తిట్టొచ్చా అని ప్రశ్నించిన జగ్గారెడ్డి.. రైతుల పక్షాన మాట్లాడితే తాము రండలమా? అని నిలదీశారు. రైతుల కోసం తాము తిట్లు తినడానికి సిద్ధం అని చెప్పారు. రైతుల పొట్టకొడితే మంత్రులు, కలెక్టర్ల వీపులు పలుగుతాయి? అని హెచ్చరించారు. మంత్రి జగదీష్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వరి కొనకపోతే మంత్రులను అడ్డుకుంటామన్నారు. మమ్మల్ని రండలు అంటే నాలుక కోస్తామని వార్నింగ్ ఇచ్చారు. మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి: Breaking: టీడీపీ గుర్తింపు రద్దు చేయండి: ఈసీకి వైసీపీ ఫిర్యాదు

Advertisement

తాజా వార్తలు

Advertisement