Saturday, April 27, 2024

మేజర్ ధ్యాన్‌ చంద్‌కి భారతరత్న ఇవ్వాలి: వీహెచ్‌

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును మార్చడం దుర్మార్గమని కాంగ్రెస్ నేత వీహెచ్‌ అన్నారు. దేశంకోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ అని గుర్తు చేశారు. గాంధీ కుటుంబంపై ఉన్న కక్షతోనే పేరు మార్చారని మండిపడ్డారు. మేజర్ ధ్యాన్‌చంద్ అవార్డు పేరిట కొత్త అవార్డును ప్రకటిస్తే బాగుండేదని, పేర్లను మార్చడం మోదీకి అలవాటైపోయిందని మండిపడ్డారు. మేజర్ ధ్యాన్‌ చంద్‌కి భారతరత్న ఇవ్వాలని వీహెచ్‌ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement