Friday, April 26, 2024

హౌస్ కీపింగ్ ఉద్యోగులకు అక్షయపాత్ర వితరణ

కోవిడ్ నేపథ్యంలో సతమతమవుతున్న నిరుపేదలకు అక్షయ పాత్ర పంపిణీచేసే కిరాణా సరుకులను సెక్రటేరియట్ హౌస్ కీపింగ్ ఉద్యోగులకు మంత్రులు ఆదిమూలపు సురేష్, సీదిరి అప్పల రాజు శుక్రవారం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సచివాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది హౌస్ కీపింగ్ ఉద్యోగులకు తొమ్మిది రకాల కిరాణా సరుకులతో కూడిన సంచులను మంత్రులు పంపిణీ చేశారు. బియ్యం, కందిపప్పు, పుట్నాలపప్పు, గోదుమ పిండి, పంచదార, ఆయిల్, పసుపు, కారం, సాంబార్ పొడి తదితర తొమ్మిది రకాల కిరాణా సరుకులతో కూడిన సంచులను పంపిణీ చేశారు.

ఇది కూడా చదవండి: జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్

Advertisement

తాజా వార్తలు

Advertisement