Friday, April 26, 2024

రేపు పరకాల నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటన

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ రేపు ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు. అకాల వర్షానికి జరిగిన పంట నష్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప‌రిశీలించ‌నున్నారు. హనుమకొండ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలోని పరకాల మండలం, నడికూడ మండలంలో అకాల వర్షానికి పంట నష్టం జరగడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ… రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, తాను స్వయంగా పంట నష్టం జరిగిన పంట పొలాల దగ్గరకు వస్తానని హామీవ్వడం జరిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement