Thursday, May 16, 2024

పని చేసిన ప్రతీ ఒక్కరినీ గుర్తించుకుని బీఆర్ఎస్ గుర్తింపునిస్తుంది – నీలం మధు ముదిరాజ్

హైదరాబాద్ కార్యాలయంలో తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా మఠం బిక్షపతి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి నీలం మధు ముదిరాజ్ హాజరై బిక్షపతిని ఘనంగా సత్కరించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఆర్థిక మంత్రివర్యులు హరీష్ రావు , ఎమ్మెల్సీ కవిత మర్యాదపూర్వకంగా కలిసిన నీలం మధు ముదిరాజ్, బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు అందరినీ సమానంగా గుర్తిస్తుందని తెలిపారు. ఉద్యమ కాలం నాటి నాయకులను, పార్టీ బలోపేతం చేసి ప్రతిష్ట పెంచిన వారిని గుర్తించుకొని పదవుల ద్వారా వారికి తగిన గౌరవం కల్పిస్తుంది అన్నారు

ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ వల్లే సాధ్యమైందని ఆయన తెలిపారు బీసీ వర్గాలకు సైతం ప్రాధాన్యత కల్పించి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసే విధంగా కృషి చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ నాయకత్వంలో మంత్రులు కేటీఆర్ హరీష్ రావు గార్ల ఆధ్వర్యంలో రాష్ట్రం లో ఉన్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. పేద ప్రజలను సైతం ఆదుకునే విధంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని ఆయన తెలిపారు మరోసారి బిఆర్ఎస్ ప్రభుత్వం ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement