Wednesday, May 29, 2024

డీఆర్వో గా బాధ్యతలు స్వీకరించిన హరిప్రియ

ప్రభ న్యూస్ ప్రతినిధి మేడ్చల్ జులై 20: మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా రెవెన్యూ అధికారి ( డీ.ఆర్.వో) గా జేఎల్బీ. హరిప్రియ గురువారం బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ప్రభుత్వం ఈ మేరకు హరిప్రియను మేడ్చల్ జిల్లా డి.ఆర్.వో గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హరిప్రియ రంగారెడ్డి జిల్లాలో ఎస్.డీ.సీ గా పనిచేశారు. ఇక్కడ మేడ్చల్ జిల్లాలో డి.ఆర్.వో గా పనిచేసిన లింగ్యానాయక్ (ఎస్.డి.సి భూ సేకరణ ) ఇటీవల వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గా పదోన్నతి పై వెళ్లారు. దీనితో, హరిప్రియను ప్రభుత్వం ఇక్కడకు ట్రాన్స్ఫర్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement