Thursday, July 25, 2024

Suicide | శ్రీశైలంలో యువ పూజారి ఆత్మహత్య

ఆంధ్రప్రభ, ఆత్మకూరు: శ్రీశైలం దేవస్థానం పరిధిలో పౌరోహిత్యం చేసే ఆదోనికి చెందిన యువకుడు మహేశ్ (24) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఓ సత్రంలో మహేష్ ఆత్మహత్య చేసుకున్న‌ట్టు గుర్తించారు. స్థానికంగా పౌరోహిత్యం చేస్తూ జీవనం సాగించేవాడ‌ని, రూమ్ లో నుండి బయటకు రాకపోవడంతో సత్రం నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, మ‌హేశ్ చ‌నిపోయిన విష‌యాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ఆత్మహత్యపై గల కారణాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement