Tuesday, July 23, 2024

Murder – తల్లిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు

ఎ.కొండూరు మే 29 (ప్రభ న్యూస్) భార్య భర్త గొడవ పడుతుండగా తల్లి కలుగజేసుకొని మందలించినందుకు, కోపో దృక్తుడైన కొడుకు తల్లిని గొడ్డలితో నరికి చంపిన సంఘటన ఇది.

- Advertisement -

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఎ.కొండూరు మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన శ్రీకాకుళపు వెంకటేష్ అలియాస్ ఫ్రాన్సిస్ బుధవారం సాయంత్రం ఫూటుగా మద్యం సేవించి వచ్చి అకారణంగా భార్యతో ఇంట్లో గొడవ పడుతుండగా తల్లి బుజ్జమ్మ(65) కుమారుడు వెంకటేష్ ను మందలించింది. దీంతో , కోపోద్రృక్తుడైన వెంకటేష్ ఇంట్లో ఉన్న గొడ్డలితో తల్లి బుజ్జమ్మను ఎడమవైపు చెవి వద్ద, మెడపైన వేటు వేయగా ఆమె అక్కడికక్కడే మరణించింది . బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కృష్ణ సిబ్బందితో సంఘటనా స్థలాన్ని చేరుకొని ముద్దాయిని అదుపులోకి తీసుకొన్నారు , మృతదేహాన్ని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement