Saturday, April 27, 2024

పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను వెంటనే తగ్గించాలని బీజేపీ ధ‌ర్నా

తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను వెంటనే తగ్గించాలని ఈరోజు గాజుల రామారం డివిజన్ పరిధిలోని ఎస్ పి పెట్రోల్ బంక్ వద్ద బీజేపీ డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ నేత ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి రేవతి రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు భానుచందర్, కిషన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు బుచ్చిరెడ్డి, రవి, మాజీ అధ్యక్షులు సునీల్ పటేల్, యువ మోర్చా అధ్యక్షుడు నవీన్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు మోహన్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, డివిజన్ కార్యదర్శి శ్రీనివాస్ నేత, మైనార్టీ మోర్చా అధ్యక్షులు జాంగిర్, డివిజన్ నాయకులు సంతోష్, డివిజన్ లోని నాయకులు, కార్యకర్తలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement