Saturday, April 27, 2024

హుజురాబాద్ పై బీజేపీ జెండా.. గెలుపుపై బండి సంజయ్ ధీమా!

హుజురాబాద్‌ బైపోల్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ దూసుకుపోతున్నారు. ప్రతి రౌండ్ లోనూ అధికార టీఆర్ఎస్ పై బీజీపీ ఆధిక్యంలో కొరసాగుతోంది. బీజేపీ ఆధిక్యంపై ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. లాస్ట్ రౌండ్ వరకు బీజేపీ లీడ్ కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమకు ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసేవారినే ప్రజలు ఆదరిస్తారని మరోసారి నిరుపించారని తెలిపారు. ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల గెలుపు ఖాయమని బండి చెప్పారు. హుజూరాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేస్తున్నాం అని స్పష్టం చేశారు. పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా టీఆర్ఎప్ ప్రజల్ని మోసం చేసిందన్నారు. ధళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఓటర్లను ఆకర్షించాలనుకున్న టీఆర్ఎస్ కు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement