Saturday, April 27, 2024

గ‌న్ పార్క్ వ‌ద్ద బండి,ఈట‌ల నిర‌శ‌న దీక్ష‌..అరెస్ట్..

హైద‌రాబాద్ – TSPSC పేపర్ లీకేజీ ఘటనను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు నిరసన దీక్ష చేపట్టారు. మరోవైపు గన్​పార్కు వద్దకు పోలీసులు చేరుకున్నారు. దీక్షకు అనుమతిలేదని చెప్పారు బండికి చెప్పారు. ఈ నేపథ్యంలో వారిని అక్కడి నుంచి వెళ్లమని చెప్పారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం తలెత్తింది. ఈ తరుణంలోనే.. అక్కడి బండి సంజయ్‌. ఈట‌ల రాజేంద‌ర్ తో స‌హ ప‌లువురిని అరెస్ట్ చేసి ఖార్ఖానా పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు.. అంత‌కు ముందు హైదరాబాద్​లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి గన్​పార్క్ వద్దకు చేరుకున్నర్యాలీగా బండి సంజ‌య్ వ‌చ్చారు..
అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం నిరశ‌న‌ దీక్ష చేప‌ట్టారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement