Thursday, April 18, 2024

రాందాస్ అగర్వాల్ ఆశయ సాధనకు కృషిచేయాలి.. ఉప్పల శ్రీనివాస్ గుప్తా

అంతర్జాతీయ వైశ్య మహా సమ్మేళన పరివార్ స్థాపించిన దివంగత నేత రాందాస్ అగర్వాల్ జీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా కోరారు. హైదరాబాద్ లోని ముషీరాబాద్ ఆర్యవైశ్య భవన్ వైశ్య హాస్టల్ లో ఐవీఎఫ్- ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో.. అంతర్జాతీయ వైశ్య మహా సమ్మేళన పరివార్ స్థాపకుడు, దివంగత నేత రాందాస్ అగర్వాల్ జీ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఘన నివాళులర్పించారు. తదుపరి ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, పేదలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ… రాందాస్ అగర్వాల్ జీ 88వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించామన్నారు. వైశ్య జాతికి వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో.. ఐవీఎప్-ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గంజి రాజమౌళి గుప్తా, ఐవీఎఫ్ తెలంగాణ మహిళా విభాగం ప్రథమ మహిళ ఉప్పల స్వప్న, ఐవీఎఫ్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ పబ్బ చంద్రశేఖర్, ఐవీఎఫ్ తెలంగాణ యూత్ అధ్యక్షుడు కట్ట రవి, ఐవీఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి శ్రీనివాస్, ఐవీఎఫ్ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు నర్సింగ్ రావు, ఐవీఎఫ్ అడ్వైసర్ ముస్త్యాల సత్తయ్య, మహిళా విభాగం సభ్యులు భువన, మిడుదొడ్డి శైలజ, ఐవీఎఫ్-ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులు, ఆర్యవైశ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement