Wednesday, May 8, 2024

DK Aruna: గద్వాల బీజేపీ అభ్యర్థిగా బలిగేర శివారెడ్డి

నవంబర్ 3 (ప్రభ న్యూస్), జోగులాంబ గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బీసీ నాయకులందరితో చర్చించి బీసీ వర్గానికి చెందిన గట్టు మండలం, బలిగేర శివారెడ్డిని గద్వాల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏకగ్రీవం చేయడం జరిగింది. గత 15 రోజుల ఉత్కంఠ కు తెరపడింది.

గద్వాల నియోజకవర్గ అభ్యర్థిగా బీసీ అభ్యర్థిని నిలబెట్టాలని బీసీ వాదాన్ని బలపరచాలని ముందు నుంచి ఆలోచన చేసి 15రోజులు చాలా మందితో చర్చలు జరిపిన తరువాత అందరి ఆమోదయోగ్యంతో బోయ కులానికి చెందిన వ్యక్తి సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న వ్యక్తి గట్టు మండలం బలిగేర గ్రామంకు చెందిన వ్యక్తి బలిగేర శివారెడ్డిని గద్వాల నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. డీకే అరుణ తీసుకున్న నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటామని ఏకగ్రీవంగా తమ మద్దతు తెలుపుతున్నామని బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులందరూ మద్దతు తెలిపి హర్షం వ్యక్తం చేయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement