Sunday, April 28, 2024

TS | ఏసీబీకి చిక్కిన నవాబుపేట ఎస్ఐ..

నవాబుపేట (ప్రభాన్యూస్) : భూ వివాదం కేసుల తొలగింపుపై నగదు డిమాండ్ చేసిన నవాబుపేట ఎస్ఐ పురుషోత్తం ఇవ్వాల (శుక్రవారం) ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డిఎస్పీ మాజిద్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. నవబ్‌పేట మండలం మల్కాపూర్ గ్రామ భూ వివాదంలో 9మందిపై కేసులు నమోదయ్యాయి. కేసు నమోదైన వారిలో ఐదుగురు తమ కేసును తొలగించాల‌ని కోరడంతో ఎస్సై ఐదు లక్షల రూపాయ‌లు డిమాండ్ చేశారు.

ఈ క్ర‌మంలో అడ్వాన్స్ గా రెండు లక్షలు, మొదటి విడతలో లక్ష ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. ఈ అంశానికి సంబంధించి మల్కాపూర్ గ్రామానికి చెందిన గజ్జి శేఖర్ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి దొరికిన ఆధారాల పరంగా కేసు నమోదు చేసి లంచం కేసులో ఎస్సైని కస్టడీకి తీసుకుంటున్నట్లు డీఎస్పీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement