Thursday, May 16, 2024

ADB: ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన‌ ముగ్గురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు

ఖానాపూర్, ఫిబ్రవరి 28 (ప్రభ న్యూస్) : ఖానాపూర్ లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఖానాపూర్ మున్సిపల్ కు చెందిన ముగ్గురు బీఅర్ఎస్ కౌన్సిల‌ర్లు 1వ వార్డు కౌన్సిల‌ర్ కావాలి సంతోష్, మూడవ వార్డు కౌన్సిలర్ జన్నారపు విజయలక్ష్మి, ఐదవ వార్డ్ కౌన్సిలర్ పరిమీలత ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో స్వతంత్ర అభ్యర్థి 10వార్డు కౌన్సిలర్ తోంటి శ్రీనుతో సహా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పరిమి సురేశ్, పట్టణ అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రజా సమస్యలపై స్పందిస్తూ పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement