Monday, April 29, 2024

ADB: ఖానాపూర్ మున్సిపాలిటీ “హస్తగతం”

ఖానాపూర్, ఫిబ్రవరి 28 (ప్రభ న్యూస్) : ఖానాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గత నెల 5వ తేదీన మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్ ల పై ఇటీవలే కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానం నెగ్గడంతో నూతన చైర్మన్, వైస్ చైర్మన్ లు ఎన్నికయ్యారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కాగా.. ఎన్నికల ప్రత్యేక అధికారి జెడ్పీ సీఈవో గోవింద్ ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. ఈ ఎన్నికకు ఖానాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు 12 మంది ఉండగా.. తొమ్మిదిమంది కౌన్సిలర్లు నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా హాజరయ్యారు.

ముందుగా మున్సిపల్ చైర్మన్ ఎన్నికను నిర్వహించగా ఏకగ్రీవంగా చైర్మన్ గా చిన్నం సత్యనారాయణ, వైస్ చైర్మన్ గా కావలి సంతోష్ ను కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఖానాపూర్ సిఐ డి మోహన్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తుతో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ శ్రేణులు నూతన చైర్మన్ వైస్ చైర్మన్ లను భారీ పూల గజమాలతో సత్కరించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట బాణాసంచాలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగాధర్ తో పాటు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement