Monday, April 29, 2024

TS : విచార‌ణ‌కు హాజ‌రుకాలేను….పోలీసుల‌కు క్రిష్ లేఖ ….

రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసులో తాను ఈరోజు విచారణకు హాజరు కాలేనని టాలీవుడ్‌ డైరెక్టర్‌ క్రిష్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేర‌కు ఆయ‌న నేడు పోలీసుల‌కు ఒక లేఖ రాశారు. తాను ముంబైలో ఉన్నందున మరో రెండు రోజులు సమయం కావాలని ఆయన పోలీసులను కోరారు.

శుక్రవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానని ఆ లేఖ‌లో పేర్కొన్నారు.. కాగా, గచ్చిబౌలి రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ హోట‌ల్లో డ్ర‌గ్స్ పార్టీ జ‌రిగిన స‌మ‌యంలో క్రిష్ అక్క‌డే ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించి ఈ కేసులో ఎనిమిదో నిందితుడిగా ఆయ‌న పేరును చేర్చారు.. విచార‌ణ కోసం నోటీస్ జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement